Congress Party | హైదరాబాద్ : సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఫ్లెక్సీలలో ఫొటోలకు సంబంధించి ప్రోటోకాల్ వివాదం చెలరేగింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫొటో లేకుండా దానం నాగేందర్ వర్గీయులు ఫ్లెక్సీలు విడుదల చేయడంతో ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్, డిప్యూటీ మేయర్ ఫొటోలు లేకుండా ఎలా ఫ్లెక్సీలు వేస్తారు? మేం ఏమైనా ఇతర పార్టీలో ఉన్నామా అంటూ విజయలక్ష్మీ మండిపడ్డారు. గొడవ అనంతరం మేసేజులు డిలీట్ చేయగా.. మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు జత చేసి మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు దానం అనుచరులు.
సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న విభేదాలు!
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఫోటో ప్రోటోకాల్ వివాదం
మేయర్ గద్వాల విజయలక్ష్మి ఫోటో లేకుండా దానం నాగేందర్ వర్గీయులు ఫ్లెక్సీలు విడుదల చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన విజయలక్ష్మి.
మేయర్, డిప్యూటీ మేయర్ ఫోటోలు లేకుండా ఎలా… pic.twitter.com/S2tcNaEEuo
— Telugu Scribe (@TeluguScribe) May 4, 2024