సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరాన్ని గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా రూపొందించడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేరొన్నారు. కేరళ రాష్ట్రం మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు మొత్తం 58 మంది బృందం జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్పై అధ్యయనం చేయడానికి సోమవారం హైదరాబాద్కు వచ్చారు.
ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ను మర్యాద పూర్వకంగా కలిసారు. జీహెచ్ఎంసీలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నగర అభివృద్ధికి చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ నిర్వహణ, ఇంటింటికీ చెత్త సేకరణ, సీఅండ్డీ వేస్ట్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, వేస్ట్ రీసైక్లింగ్ మెటీరియల్, తదితర అంశాలను మేయర్ వివరించారు.
ప్రతి రోజు స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో ఇంటింటి నుంచి ప్రతి రోజూ సేకరించిన 7500 మెట్రిక్ టన్నుల చెత్తను జవహర్ నగర్ డంప్ యార్డు తరలించి వర్మీ కంపోస్టు తయారీ చేస్తామని కమిషనర్ తెలిపారు. ప్యారా నగర్లో మరొక డంపు యార్డు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. భవన నిర్మాణ వ్యర్థాలకు రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశామని, మరో రెండు ప్లాంట్లను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. డంపింగ్ యార్డుకు తరలించే ప్రతి వాహనానికి జీపీఎస్ మ్యాపింగ్ చేస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఫె్లైఓవర్లు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు, సోషల్ సెక్యూరిటీ పథకాలు అమలు చేసినట్లు కమిషనర్ వివరించారు. స్టాండింగ్ కమిటీ, కౌన్సిల్ సమావేశాల నిర్వహణ, తదితర విషయాలపై కేరళ బృందం అడిగిన ప్రశ్నలకు మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ సమాధానాలు ఇచ్చారు. అనంతరం కేరళ బృందం జీహెచ్ఎంసీలో ప్రజావాణి కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేరళ రాష్ట్రంలో జనాభా, ఆర్థిక వృద్ధి, అక్షరాస్య తతో తమ మున్సిపాలిటీలలో చేపట్టే బెస్ట్ ప్రాక్టీసెస్ కార్యక్రమాలను వారు వివరించారు.
ఈ సందర్భంగా వారు మేయర్, కమిషనర్, అధికారులు, కౌన్సిల్ సభ్యులను తమ రాష్ట్రం లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆదాయ వనరులు బాగున్నాయన్నారు. చూడదగ్గ నగరాలలో హైదరాబాద్ ఒకటని, ఈ నగర సందర్శన తమకు ఆనందాన్ని ఇచ్చిందని కేరళ బృందం పేరొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ రాష్ట్ర మున్సిపల్ మేయర్లు, చైర్మన్లు, జీహెచ్ఎంసీ వివిధ విభాగాల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.