పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు జీహెచ్ఎంసీ సరికొత్త అడుగులు వేస్తున్నది. సమస్యల సత్వర పరిష్కారమే ధ్యేయంగా వార్డు వ్యవస్థను అమలు చేస్తున్నది. జూన్ 1 నుంచి ప్రారంభం కానున్న వార్డు పాలన కోసం ఇప్పటికే 150 వార్డు కార్యాలయాలను సిద్ధం చేసింది. ఒక్కో కార్యాలయంలో పది మంది అధికారుల బృందంతో వార్డు పాలన ప్రారంభం కానున్నది. ఈ మేరకు పాలనా మార్గనిర్దేశకాలపై గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్ తదితరులు అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వార్డు పరిపాలన సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిషరించిన మేయర్ మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ విజన్ను అనుసరించి 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా వార్డు వ్యవస్థ పని చేస్తుందన్నారు. అధికారులు ప్రజలతో సానుకూల దృక్పథంతో, పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని సూచించారు.
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ) : ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకు జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా వార్డు వ్యవస్థను అమల్లోకి తీసుకువస్తున్నదని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ లోకేశ్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్తో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి వార్డు అధికారుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విజన్ను అనుసరించి 50 వేల జనాభాకు ఒక వార్డును ఏర్పాటు చేస్తున్నట్లు మేయర్ పేర్కొన్నారు. వార్డు కార్యాలయాలను పది మంది వివిధ విభాగాలకు చెందిన అధికారుల బృందంతో ప్రారంభిస్తున్నామని తెలిపారు. ప్రజల నుంచి అందిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు సత్వరమే చర్యలు తీసుకుని తిరిగి ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా వార్డు వ్యవస్థ పని చేస్తుందని మేయర్ చెప్పారు. వార్డు స్థాయిలో వచ్చే తాగునీటి సమస్యలు, సీవరేజ్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్ తదితర సమస్యలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సిటీజన్ చార్ట్ ఆధారంగా నిర్ణీత సమయంలో సమస్య పరిషారానికి కృషి చేస్తారని తెలిపారు. అధికారులు ప్రజలతో సానుకూల దృక్పథంతో, సహనంతో పారదర్శకతతో, జవాబుదారీతనంతో ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని తెలిపారు. వార్డు లెవెల్ అధికారులు కార్పొరేటర్లకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా మేయర్ వార్డు పరిపాలన సంబంధించిన నియమావళి పుస్తకాన్ని ఆవిషరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ ప్రియాంక అలా, ఈఎన్సీ జియా ఉద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్రెడ్డి, సీసీపీ దేవేందర్రెడ్డి, అడిషనల్ కమిషనర్లు వి.కృష్ణ, జయరాజ్ కెన్నెడీ సరోజ, జోనల్ కమిషనర్లు మమత, రవి కిరణ్, పంకజ, శంకరయ్య, శ్రీనివాస్రెడ్డి, అశోక్ సామ్రాట్, అసీ ప్రొఫెసర్ స్నేహలత, ప్రాజెక్ట్ ఆఫీసర్ సౌజన్య, డిప్యూటీ కమిషనర్లు, వార్డు పరిపాలన అధికారులు, వాటర్ వర్స్, విద్యుత్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వార్డు వ్యవస్థను నెలకొల్పడం ద్వారా ప్రజా సమస్యలను అత్యంత సులువుగా, వేగవంతంగా పరిషరించడానికి వీలు పడుతుందని జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తెలిపారు. వార్డు ఆఫీస్లలో జీహెచ్ఎంసీ విభాగాలైన అర్బన్ బయోడైవర్సిటీ, హెల్త్, శానిటేషన్, టౌన్ ప్లానింగ్, వార్డ్ ఇంజినీర్, ఎంటమాలజీ, వాటర్ వర్స్, విద్యుత్ తదితర శాఖల అధికారులు పని చేస్తారని చెప్పారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించేందుకు హెడ్ ఆఫీస్, సరిల్ జోనల్ కార్యాలయాలకు వెళ్లకుండా దగ్గరలో ఉన్న వార్డు కార్యాలయానికి వస్తారన్నారు. వార్డు ఆఫీస్కు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తెలిపారు. ఎకువగా శానిటేషన్, టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలపైనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. వార్డు లెవెల్ సిబ్బంది ఉదయం తమ పరిధిలో వార్డులో పర్యటించి ప్రజల సమస్యల పరిషారానికి కృషి చేయాలన్నారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు తప్పనిసరిగా అందరూ వార్డు కార్యాలయంలో ఉండాలని కమిషనర్ ఆదేశించారు. వార్డు వ్యవస్థ పౌర సేవల కేంద్రంగా పని చేయాలన్నారు. వార్డు వ్యవస్థపై టౌన్ ప్లానింగ్, ఎంటమాలజీ, శానిటేషన్, వాటర్ వర్స్ వంటి పలు విభాగాలపై సమగ్ర శిక్షణను నగర వ్యాప్తంగా సంబంధిత జోన్లలో హెచ్వోడీలతో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే శనివారం డిప్యూటీ కమిషనర్లకు, వార్డు లెవల్ అధికారులకు సమావేశాన్ని నిర్వహిస్తామని తెలిపారు. వార్డు కార్యాలయంలో కావాల్సిన మౌలిక సదుపాయాలు, పరిపాలనపై ఎప్పటికప్పుడు జోనల్, డిప్యూటీ కమిషనర్లు రోజువారీగా సమీక్షించాలన్నారు. వార్డు వ్యవస్థ పనితీరుపై నెల రోజుల్లో సమీక్షిస్తామని స్పష్టం చేశారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజా సమస్యలను విసృ్తతంగా పరిషరించడానికి వార్డు వ్యవస్థ అందుబాటులోకి వస్తున్నట్లు జలమండలి ఎండీ దానకిశోర్ తెలిపారు. ప్రతిరోజు సోషల్ మీడియా, వాట్సాప్, హెల్ప్ లైన్, ఆఫ్ లైన్ ద్వారా అందుతున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలోనే ఎప్పటికప్పుడు పరిషరిస్తున్నట్లు తెలిపారు. నగరానికి వందేండ్లకు సరిపడా తాగునీటి వసతి, వంద శాతం సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జలమండలిలో 48 రకాల గ్రీవెన్స్పై హెల్ప్లైన్ ద్వారా 30 మంది పర్యవేక్షిస్తున్నారన్నారు. ఇందులో సిల్ట్ కార్ట్, లో వాటర్, పొల్యూట్ వాటర్పై లైన్మెన్ టెస్టింగ్లను నిర్వహిస్తారని చెప్పారు. తాగునీరు లీకేజీ కాకుండా టెక్నాలజీ ద్వారా గుర్తించి, రివర్స్ వాటర్ సైప్లె కాకుండా చర్యలు తీసుకుంటామని ఎండీ తెలిపారు.
విభాగం – ఇన్చార్జి ఆఫీసర్
అడ్మినిస్ట్రేషన్ – వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్
ఇంజినీరింగ్ -వార్డు ఇంజినీర్
టౌన్ప్లానింగ్ -వార్డు టౌన్ప్లానింగ్
ఎంటమాలజీ – వార్డు ఎంటమాలజిస్ట్
శానిటేషన్ -వార్డు శానిటరీ జవాన్
అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ -వార్డు యూబీడీ సూపర్వైజర్
జలమండలి -వార్డు అసిస్టెంట్
టీఎస్ఎస్పీడీసీఎల్ -లైన్మెన్/లైన్ ఇన్స్పెక్టర్
గ్రీవెన్స్ రిజిస్ట్రేషన్ -కంప్యూటర్ ఆపరేటర్
ఎకనాలెజ్డ్మెంట్స్ -రిసెప్షన్