సిటీబ్యూరో, డిసెంబర్ 30(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగరాభివృద్ధి విశ్వ నగరాన్ని మించి నడుస్తున్నది. విశ్వంలో పేరుగాంచిన పలు నగరాలలో జరుగుతున్న అభివృద్ధిని పోలి మహా నగర ప్రస్థానం కొనసాగుతున్నది. ఒక రకంగా మి షన్ మోడ్లో నడుస్తున్నట్టుగాను చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీ ర్చిదిద్దాలని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్లు సంకల్పించారు. ఇందులో భాగంగానే తెలంగాణ రా ష్ట్రం ఏర్పడినప్పటి నుంచి నగర మౌలిక సదుపాయాలు అభివృద్ధి, మరొక వైపు సంక్షేమం, సుందరీకరణ పనులు అన్ని శాఖల సమన్వయంతో చేప ట్టి పూర్తి చేస్తున్నారు. నగరాభివృద్ధికి మేయర్ గ ద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీల త శోభన్రెడ్డి, కార్పొరేటర్ల భాగస్వామ్యంతో మహానగరంలోని కోటిపై చిలుకు జనాభా జీవనాన్ని ప్ర భావితం చేశాయి. జీహెచ్ఎంసీలోని వివిధ విభాగాలు 2021లో సాధించిన పురోగతి వివరాలిలా..
చిన్న స్థలం నుంచి.. అందరికీ అనుమతులు
టౌన్ ప్లానింగ్-టీఎస్-బీ పాస్ ద్వారా 75 గజాల లోపున్న వారికి ఇళ్ల నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్న 2,241 మందికి తక్షణమే అనుమతి ఇచ్చా రు. అదే విధంగా 75 నుంచి 600 గజాలలోపు జీ+2 ఇళ్లు నిర్మించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న 8,534 మందికి తక్షణమే అనుమతి పొందగా, 600 గజాల పై బడిన, 10 మీటర్ల ఎత్తు గల భవన నిర్మాణాలకు 1,33 5 మందికి సింగిల్ విండో ద్వారా అనుమతి ఇచ్చారు. అక్రమ నిర్మాణాలు తొలగించడం కోసం జోనల్ స్థాయి లో ఎన్ఫోర్స్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి చర్యలు తీసుకుంటున్నారు. కాగా, అన్నపూర్ణ కేంద్రాల ద్వారా ఈ ఏడాది 1,51,79,215 మంది ఆకలి తీరింది.
డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం
నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పంతో గ్రేటర్ పరిధిలో 111 ప్రాంతాల్లో చేపట్టిన లక్ష డబుల్ బెడ్ రూంల నిర్మాణం ముమ్మరంగా సాగుతోంది. ఈ సంవత్సరం 13,610 గృహాలు పూర్తికాగా, వాటిలో 15 లొకేషన్లలో 2510 ఇళ్లను ప్రారంభించారు. వాటిలో 1,681 ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. 31,291 ఇళ్లు అభివృద్ధి దశలో ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్..
పరిసరాల పరిశుభ్రతతో మానవ జీవన ప్ర మాణాలు పెంపొందించేందుకు విశేష కృషిలో భాగంగా ఇంటింటికి వెళ్లి పొడి, తడి చెత్తను సేకరించి డంప్ యార్డుకు తరలించి వ్యర్థాలను తిరిగి పునరుత్పత్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్లో మూడు అవార్డులు వరించాయి.
హరితహారం..
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో 120 లక్షల మొకలు నాటాలనే లక్ష్యం ఉంది. కాగా ఇప్పటి వరకు 123 లక్షల మొకలు నాటడం జరిగింది. జంక్షన్ బ్యూటిఫికేషన్లో భాగంగా ఉప్పల్, మల్లాపూర్, హయత్ నగర్, ఆరాంఘర్ జంక్షన్లను పూర్తిచేయనైనది. వర్టికల్ గార్డెన్ అభివృద్ధిలో భాగంగా బాలానగర్, షేక్పేట, నారాయణగూడ ఫె్లైఓవర్లను పూర్తిచేయడం జరిగింది.
వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి..
ఎస్ఆర్డీపీ – వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా క్యాలెండర్ ఇయర్లో రూ.647 కోట్లతో ఐదు పనులను పూర్తి చేశారు. అందులో హైటెక్ రైల్వే అండర్ బ్రిడ్జి, పాత బస్తీ ఏపీజే అబ్దుల్ కలాం ఫె్లైఓవర్, బాలానగర్ ఫె్లైఓవర్, మలాజిగిరి ఆనంద్ బాగ్లో ఆర్యూబీ, మెదక్ సెక్షన్ అభివృద్ధి పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువచ్చారు.
లింక్ రోడ్ల నిర్మాణం: జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారులకు కనెక్టివిటీ పెంచడంతో పాటు మౌలిక సదుపాయాల అభివృద్ధికి గాను మిస్సింగ్ లింక్ రోడ్లను చేపట్టింది. మొదటి దశలో భాగంగా 22 మిస్సింగ్ రోడ్లను గుర్తించగా ఇప్పటి వరకు 16 పనులు పూర్తయ్యాయి. రూ.497 కోట్లతో 29 లింక్ రోడ్లను పురోగతిలో ఉన్నాయి.
బస్తీ దవఖానా.. వ్యాక్సినేషన్…
స్లమ్ ఏరియాలోని పేదలకు మెరుగైన వైద్యం అం దించేందుకు సీఎం ఈ సంవత్సరం కొత్తగా 34 దవాఖానలను ఏర్పాటు చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులలో గల 4846 కాలనీలలో మొదటి డో స్ వ్యాక్సినేషన్ పూర్తి చేయడమైనది. రెండో డోస్ వ్యా క్సిన్ డిసెంబర్ 8న ప్రారంభమై కొనసాగుతుంది.