సిటీబ్యూరో, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ ): ప్రజల సమస్యలను నేరుగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ప్రతి సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి సందర్భంగా సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు శనివారం అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
నగర ప్రజలు తమ సమస్యలను తెలియజేసేందుకు 040-2322 2182 నంబర్లో సంప్రదించాలన్నారు. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు చెప్పారు. సర్కిల్, జోనల్ కార్యాలయాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం యధావిధిగా జరుగుతుందని తెలిపారు.