హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన డిజిటల్ బోర్డుకు జీహెచ్ఎంసీ జరిమానా విధించింది. సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద ‘సాలు దొర.. సెలవు దొర’ అనే డిజిటల్ కౌంట్డౌన్ బోర్డును బీజేపీ నేతలు ఏర్పాటు చేశారు. అయితే అనుమతి లేకుండా బోర్డును ఏర్పాటు చేసినందుకుగాను గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులు రూ.50 వేలు జరిమానా విధించారు.