సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ) : ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా బుధవారం ఉదయం 6 నుంచి గురువారం ఉదయం 6 గంటల వరకు జిల్లాలో వివిధ ఎన్నికల ఎన్ఫోర్స్మెంట్ విభాగాల ద్వారా విస్తృత తనిఖీలు నిర్వహించగా.. రూ. 23.92 లక్షల నగదును పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ తెలిపారు.
నగదుతో పాటు రూ.14.66 లక్షల విలువ గల ఇతర వస్తువులు పట్టుకొని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు, ఇతర వస్తువులపై 10 ఫిర్యాదులు రాగా వాటన్నింటినీ పరిశీలించి పరిష్కరించనున్నట్లు తెలిపారు. ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు చెప్పారు.