సిటీబ్యూరో, జనవరి 29 (నమస్తే తెలంగాణ) : జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం జీహెచ్ఎంసీ పరిధిలో మాంసం దుకాణాలను మూసి వేయాలని కమిషనర్ రోనాల్డ్రాస్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
నిబంధనలు అతిక్రమించిన దుకాణాదారులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. కాగా, ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటల వరకు బాపూఘాట్, లంగర్హౌస్, రేతిబౌలి జంక్షన్, నాలానగర్ జంక్షన్, లంగర్హౌస్, సంగం బస్స్టాప్, షేక్పేట్ నాలా తదితర ప్రాంతాల్లో ట్రాఫిక్ను నిలిపివేయడం లేదంటే మళ్లించడం చేస్తామని ట్రాఫిక్ అదనపు సీపీ తెలిపారు.