సిటీబ్యూరో, మార్చి 11 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి
(జీహెచ్ఎంసీ కమిషనర్) రోనాల్డ్ రాస్ సోమవారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.
అదనపు నోడల్ అధికారులు, సబ్ నోడల్, ఆర్వో, ఏఆర్లతో సమావేశమయ్యారు. హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన అధికారులు, పోలింగ్ స్టేషన్లు, సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లు తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో నగర అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్ తదితరులు పాల్గొన్నారు.