సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ) : నాలాలు అన్యాక్రాంతం కాకుండా, నాలాలో ప్రమాదాలు జరుగకుండా జీహెచ్ఎంసీ నాలా భద్రతకు చర్యలు చేపట్టింది. ఈ వానకాలంలో నాలా భద్రత ఆడిట్ను చేపట్టేందుకు జీహెచ్ఎంసీ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నది. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక ఫోకస్ చేసి, సరిల్ వారీగా నాలాల విభాగాలను (సెచెస్) నిర్ధారించింది. గత ఏడాదిలానే ఒకొక విభాగానికి ఒక ఏఈ గానీ, డిప్యూటీ ఈఈలను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించారు. అధికారులకు కేటాయించిన సెచెస్లో పూడికతీత, ఇతర లోపాలను గుర్తించి పూర్తి నివేదికను నెలాఖరులోగా అందజేయాలని ఆదేశించారు. నాలా భద్రత పనులు పూర్తి చేయాలని, ఎట్టిపరిస్థితుల్లోనూ అజాగ్రత్త, నిర్లక్ష్యం మూలంగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగకూడదని అధికారులకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్ దిశానిర్దేశం చేశారు.
నాలాలు అన్యాక్రాంతం కాకుండా, నాలాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జీహెచ్ఎంసీ నాలాల భద్రతకు చర్యలు చేపట్టింది. గతేడాది లాగానే ఈ వర్షాకాలంలో కూడా నాలా భద్రతకు రక్షణ చర్యలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తున్నది. రానున్న వర్షాకాలంలో ప్రమాదాలు జరగకుండా, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకునేందుకు సరిళ్ల వారీగా నాలాల విభాగాలను(సెచెస్) నిర్ధారించి ఒకొక విభాగానికి ఒక ఏఈ గానీ డిప్యూటీ ఈఈలను బాధ్యులను చేయాలని కమిషనర్ నిర్ణయించారు. దీంతో సంబంధిత ఇంజినీరింగ్ మెయింటెనెన్స్ ఈఎన్సీ క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్లు, ఈఈలు ఒకొక విభాగానికి ఒక ఇంజినీరింగ్ అధికారిని నియమిస్తూ.. వారు తీసుకోవాల్సిన చర్యలను నిర్లక్ష్యం చేయకుండా విధులు చేపట్టాలని ఆదేశించారు.
కేటాయించిన సర్కిళ్లలో పూడికతీత, ఇతర లోపాలను గుర్తించి మిస్సైన నాలాల పూర్తి వివరాల నివేదికను ఈ నెల చివరిలోగా అందజేయాలన్నారు. అంతే కాకుండా ప్రహరీ గోడల పునరుద్ధరణ, చైన్ లింక్, ఫెన్సింగ్, బారికేడ్లు, ఓపెన్ నాలా, డ్రెయిన్ల ఫెన్సింగ్, హెచ్చరిక బోర్డులు, ప్రమాదాలు జరగకుండా సూచించే మార్లు వాటితో పాటు ఓపెన్ నాలా బాక్స్డ్రెయిన్, స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లలో కూడా ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటారు. వార్డులకు కేటాయించిన ఇంజినీరింగ్ ఆఫీసర్లు స్ట్రామ్ వాటర్ డ్రెయిన్లకు సంబంధించిన క్యాచ్పిట్స్, బాక్స్ డ్రెయిన్ మ్యాన్హోల్స్ దెబ్బతిన్న వాటిని, పనికి రాకుండా ఉన్న కవర్స్ వెంటనే రీ-ప్లేస్ చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. ఈ విషయంలో అజాగ్రత్త, నిర్లక్ష్యం మూలంగా అవాంఛనీయ ఘటనల వల్ల ఆస్తి, ప్రాణ నష్టం జరిగిన పక్షంలో సంబంధిత అధికారులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. రోజువారీగా డీ-సిల్టింగ్ వివరాలు ఫొటోతో అప్లోడ్ చేయాలన్నారు. ప్రమాద హెచ్చరిక బోర్డులతో పాటు నాలాల్లో ప్రవహించే నీటి ప్రవాహం తెలుసుకునేందుకు వల్బారెబుల్ పాయింట్ల వద్ద మీటర్ ఏర్పాటుతో పాటు ఫ్లోటింగ్ మెటీరియల్ను కూడా ఎప్పటికప్పుడు తొలగించేందుకు చర్యలు తీసుకుంటారని చెప్పారు. ఐఆర్టీ వరర్లు రోజువారీ అటెండెన్స్తో పాటు వారు తీసిన డీ- సిల్టింగును వెంటనే తరలించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.