హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ( GHMC ) సర్వసభ్య సమావేశంలో 2021-22 ఆర్థిక సంవత్సర పద్దును బల్దియా ఆమోదించింది. రూ. 5,600 కోట్ల పద్దుకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. నూతన పాలక మండలి ఆధ్వర్యంలో, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన తొలి సర్వసభ్య సమావేశం జరిగింది. కరోనా మహమ్మారి దృష్ట్యా వర్చువల్గా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నగరంలో జరుగుతున్న అభివృద్ధిపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రసంగించారు. 2021-22 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను గత డిసెంబర్ 17న స్టాండింగ్ కమిటీ ఆమోదించిన సంగతి తెలిసిందే.