విధులలో అలసత్వం వహించిన అధికారులపై మేయర్ కొరడా ఝులిపించారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్లో భాగంగా నగరంలో చేపడుతు న్న పారిశుధ్య నిర్వహణ పనులపై మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక పర్యటనలు కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా చార్మినార్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ జోన్ల లో పర్యటించిన మేయర్ మంగళవారం సికింద్రాబాద్, ఎల్బీనగర్ జోన్లలోని ప్రాంతాలలో పర్యటించారు. ఈ సం దర్భంగా పారిశుధ్య నిర్వహణలో ఆలసత్వం వహించిన ఎస్ఎఫ్ఏ (శానిటరీ ఫీల్డ్ అసిస్టెంట్)పై వేటు పడింది. గడిచిన మూడు రోజులుగా అధికారులు హెచ్చరిస్తున్నా పెడచెవిన పెడుతూ వస్తున్న నేపథ్యంలో ఎస్ఎఫ్ఏ తొలగించడం, ఏళ్ల తరబడి ఒకేచోట పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, ఎస్ఎఫ్ఏలు ఇతర చోటుకి మారుస్తామన్న హెచ్చరికలతో క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున కదలిక వచ్చింది.
సికింద్రాబాద్ జోన్ పరిధిలోని కింగ్కోఠి, రామ్కోఠి, కాచిగూడ స్టేష న్ రోడ్డు, నింబోలి అడ్డాలో మేయర్ ఆకస్మిక పర్యటన చేశా రు. నింబోలి అడ్డాలో జనం తమకు ఆటో రావడం లేదని, అలాగే, ఎస్ఎఫ్ఏ భూమేష్ సరిగ్గా క్లీన్ చేయించడంలో నిర్ల క్ష్యం వహిస్తున్నారని మేయర్ దృష్టికి తీసుకువచ్చారు. వెంట నే జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పనితీరుపై అసహనం వ్యక్తం చేసిన మేయర్ సంబంధిత ఎస్ఎఫ్ఏ భూమేష్ను తొలగించారు. అనంతరం ఎల్బీనగర్లోని గడ్డి అన్నా రం, సరూర్నగర్, లింగోజిగూడ, చంపాపేట, హస్తినాపు రం, వనస్థలిపురం, బీఎన్ రెడ్డి నగర్, మన్సురాబాద్, నాగో ల్, ఉప్పల్, నాచారం, మల్లాపూర్ డివిజన్లలో పలు కాలనీలలో మేయర్ సందర్శించారు. లింగోజిగూడలోని తపోవ న్ కాలనీలో నాలా వద్ద పేరుకుపోయిన చెత్తను దగ్గర్నుండి అక్కడే ఉన్న పారిశుద్ధ్య కార్మికులచే తొలగింపు పనులు చేపట్టారు.
మళ్లీ ఆ ప్రదేశంలో చెత్త వేయకుండా చూసి చెట్లు నా టాలన్నారు. సంబంధిత స్థలంలో మొబైల్ సీటీపీ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హస్తినాపురంలో ఏర్పాటు చేసిన సీటీపీ ప్లాంట్ను సందర్శించిన మరిన్ని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆటోనగర్లో ఇన పాత డంపింగ్ యార్డ్ వద్ద రోడ్డు పక్కనున్న చెత్తను వెంటనే తొలగించాలని మేయర్ చెప్పారు. బతుకమ్మ కుంట వద్దనున్న చెత్తను ఎత్తివేసి వాకింగ్ట్రాక్, సీటీపీ ప్లాంట్ ఏర్పాటు, గ్రీనరీ అభివృద్ధి చేయాలని సూచించారు. మన్సురాబాద్లో 30 కాలనీలో నాలా, రోడ్డు సమస్యను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా స్థానికులకు మేయర్ హామీ ఇచ్చారు. ఆటోనగర్ శ్మశాన వాటికలో ఏర్పాటు చేసిన బయో గ్యాస్ యంత్రాన్ని పరిశీలించారు.