దుండిగల్, మే 26 : గుట్టుచప్పుడు కాకుండా గంజాయి దందా చేస్తున్న ఇద్దరిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి, రిమాండ్కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశాకు చెందిన చిన్న హరిజన్ (26) ఉపాధి కోసం హైదరాబాద్కు వలసవచ్చి కైసర్నగర్లో ఉంటూ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అదే రాష్ర్టానికి చెందిన గమ్మం పద్మ (44) కూడా గండి మైసమ్మలోని డాక్టర్ బస్తీలో ఉంటూ టీ స్టాల్ నిర్వహిస్తున్నది. ఒకే రాష్ర్టానికి చెందిన వీరిద్దరూ స్వరాష్ట్రం నుంచి గుట్టుచప్పుడు కాకుండా అక్రమ మార్గాల్లో గంజాయి తీసుకువచ్చి విక్రయిస్తున్నారు.
బుధవారం సాయంత్రం చిన్న హరిజన్ స్కూటీపై గంజాయిని తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 960 గ్రాముల గంజాయితో పాటు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు గమ్మం పద్మను కూడా అరెస్టు చేశారు. గతంలో కూడా పద్మ గంజాయి విక్రయిస్తూ మేడ్చల్ పోలీసులకు పట్టుబడిందని, రెండు కేసులు ఉన్నాయని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ మేరకు ఇద్దరిపై కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం రిమాండ్కు తరలించారు.