దుండిగల్, మార్చి 31 : నిర్మాణంలో ఉన్న ఇండ్లలోని కరెంట్ వైర్లను దొంగిలిస్తున్న ముఠా సభ్యులను బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిందితుల నుంచి రూ.90వేల విలువ చేసే విద్యుత్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని శేరిలింగంపల్లి పరిధి, మియాపూర్లోని న్యూకాలనీకి చెందిన డ్యాన్స్మాస్టర్ సింగిడోలు రమణ(27), మహబూబ్నగర్ జిల్లా, కేశంపేటవాసి, మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలోని గుడిసెల్లో నివాసముండే ఆటోడ్రైవర్ దుడ్డురుకు బాలకృష్ణ(25), అదే ప్రాంతంలో నివాసముండే రోజువారి కూలీ సిరి రమేశ్(33), స్నేహితులు. వీరు ముగ్గురు ముఠాగా ఏర్పడ్డారు.
గత కొంతకాలంగా ఇటువంటి చోరీలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారం రోజుల కిందట నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, ప్రగతినగర్, బాచుపల్లి కాసానికౌసల్యకాలనీల్లో నిర్మాణంలో ఉన్న ఇండ్లలో నుంచి కరెంట్వైర్లు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో సీఐ ఉపేందర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించారు. దీంతో వారినుంచి రూ.90వేల విలువ చేసే కరెంట్ వైర్లను స్వాధీనం చేసుకుని, రిమాండ్కు తరలించారు.