హైదరాబాద్ : ఖైరతాబాద్ గణేశ్ విగ్రహ నమూనాను ఉత్సవ కమిటీ ఇవాళ ఆవిష్కరించింది. ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా భక్తులకు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనమివ్వనున్నాడు. మండపంలో గణనాథుడికి ఎడమ వైపు కాలనాగదేవత, కుడివైపు కాలవిష్ణు విగ్రహాలు ఏర్పాటు చేయనున్నారు. ఇరువైపులా కృష్ణకాళి, కాళనాగేశ్వరిమూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. ఈ సారి 40 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.