ఉప్పల్, ఆగస్టు 26 : గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. శుక్రవారం ఉప్పల్ మున్సిపల్ కార్యాలయంలో గణేశ్ నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఆలయ మండపాల వద్ద అన్ని శాఖల అధికారులు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని, రహదారులలో ట్రాఫిక్కు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఉత్సవాలు ముగిసే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాలనీవాసులు, ఉత్సవ సమితి ప్రతినిధులు ఉత్సవాల సందర్భంగా అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కక్కిరేణి చేతన, బండారు శ్రీవాణి, ఈఈ నాగేందర్, జలమండలి మేనేజర్ జాన్షరీఫ్, ఉప్పల్ సీఐ గోవిందరెడ్డి, ట్రాఫిక్ సీఐ పార్థసారధి, విద్యుత్శాఖ ఏడీఈ బాలకృష్ణ, ఏఎంసీ కుమార్, డీఈ చందన, నేతలు జనుంపల్లి వెంకటేశ్వర్రెడ్డి, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గరిక సుధాకర్, పల్లె నర్సింగ్రావు, ఎదుల కొండల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాప్రా సర్కిల్ కార్యాలయంలో…
కాప్రా, ఆగస్టు 26: గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేసేందుకు చర్యలు చేపట్టాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి సూచించారు. శుక్రవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో గణేశ్ ఉత్సవాల నిర్వహణపై జీహెచ్ఎంసీ అధికారులు, ఉత్సవ కమిటీలు, మండపాల నిర్వాహకులు, పోలీసు అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈనెల 31నుంచి జరిగే ఉత్సవాల నిర్వహణ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులు ఇందుకు సంబంధించి ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీసీ శంకర్, కార్పొరేటర్లు స్వర్ణరాజు శివమణి, సింగిరెడ్డి శిరీష సోమశేఖర్రెడ్డి, బొంతు శ్రీదేవి, జెర్రిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్రెడ్డి, ఈఈ హరిలాల్, ఏఎంఓహెచ్ డా.స్వప్నారెడ్డి, జలమండలి మేనేజర్ జాన్ షరీఫ్, డీజీఎం సతీశ్, కుషాయిగూడ సీఐ వెంకటేశ్వర్లు, ట్రాఫిక్ సీఐ, శానిటేషన్ సూపర్వైజర్ నాగరాజు, ఏఈఈలు, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధి చల్ల ప్రభాకర్, మండపాల నిర్వాహకులు, టీఆర్ఎస్ నాయకులు సాయిజెన్శేఖర్, మచ్చపాండు, పవన్, కుమారస్వామి, సతీశ్రెడ్డి, రామతులసి, రమాదేవి, గిరిబాబు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే ఆదేశాలతో అందుబాటులోకి బోరు
చర్లపల్లి, ఆగస్టు 26 : ఏఎస్రావునగర్ డివిజన్ కుషాయిగూడ ఆరోగ్య కేంద్రంలో పని చేయని బోరును ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి ఆదేశాల మేరకు అందుబాటుల్లోకి తీసుకురావడంతో స్థానికులు, రోగులు హర్షం వ్యక్తం చేశారు.