బడంగ్పేట : అహింస మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన గొప్ప మహానీయుడు మహాత్మా గాంధీజీ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(Minister Sabita Indra Reddy) అన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని జిల్లెలగూడలో ఉన్న విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళి అర్పించారు.
ప్రతి ఒక్కరూ గాంధీని ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. సహనం, ఓర్పు , అహింసా మార్గాలతో దేశ ప్రజలకు విముక్తి కల్గిందన్నారు. అనంతరం చందన చెరువు కట్టపై మొక్కలు నాటి పచ్చదనం పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేయర్ దుర్గా దీప్లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కందుకూరు జడ్పీ టీసీ జంగారెడ్డి, కార్పొరేటర్లు సిద్దాల లావణ్య బీరప్ప, అనిల్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు అర్కల కామేష్ రెడ్డి, రాజ్కుమార్, ప్రభాకర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.