బన్సీలాల్పేట్, డిసెంబర్ 27 : కొవిడ్ మూడు దశలను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, ఇప్పుడు కూడా గాంధీ దవాఖానలో అప్రమత్తం చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు తెలిపారు. కొవిడ్ సన్నద్ధత చర్యల్లో భాగంగా గాంధీలో నిర్వహించిన మాక్డ్రిల్లో మంగళవారం ఆర్ఎంవో డాక్టర్ జయకృష్ణతో కలిసి ఓపీ, ఎమర్జెన్సీ వార్డు, ఆక్సిజన్ ప్లాంట్, లిక్విడ్ సిలిండర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీలో మొత్తం 1890 బెడ్లు ఉన్నాయని, అందులో 650 ఐసీయూ, 600 ఆక్సిజన్ బెడ్లు, మిగిలినవి సాధారణ బెడ్లు, 530 వెంటిలేటర్లు ఉన్నాయని చెప్పారు. 6 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 46 కిలో లీటర్ల సామర్థ్యం కలిగిన 3 లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకులు, 300 బల్క్ ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. దవాఖానలో ప్రస్తుతం ఆరుగురు కొవిడ్ బాధితులు ఉన్నారని చెప్పారు.