Traffic alert | శేరిలింగంపల్లి, మే 10 : గచ్చిబౌలి నుంచి కొండాపూర్ వరకు కొత్త ఫ్లైవోవర్ను నిర్మిస్తున్న నేపథ్యంలో ఈనెల 13నుంచి మూడు నెలల పాటు మూసివేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ నారాయణ నాయక్ వెల్లడించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆయన సూచించారు. బుధవారం గచ్చిబౌలిలోని మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబరాబాద్ ట్రాఫిక్-1 డీసీపీ హర్షవర్ధన్ పూర్తి వివరాలు వెల్లడించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో శిల్పాలేఅవుట్ ఫ్లైవోవర్ రెండోదశ నిర్మాణ పనుల నేపథ్యంలో గచ్చిబౌలి జంక్షన్ నుంచి కొండాపూర్ వెళ్లే రహదారిపై ఈనెల 13వ తేదీ నుంచి 90 రోజుల పాటు వాహనాలను దారి మళ్లించడం జరుగుతుందని తెలిపారు.
గచ్చిబౌలి జంక్షన్ టు కొండాపూర్ వైపు వెళ్లే మార్గాన్ని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వాహనాలు సజావుగా వెళ్లేందుకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందన్నారు. ఈ సమావేశంలో మాదాపూర్ లా అండ్ ఆర్డర్ డీసీపీ కె.శిల్పవల్లి, ట్రాఫిక్ ఏసీపీ హనుమంతరావు, లా అండ్ ఆర్డర్ ఏసీపీ రఘునందన్రావు, గచ్చిబౌలి, రాయదుర్గం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు నవీన్కుమార్, శ్రీనాథ్ పాల్గొన్నారు.
దారి మళ్లింపు ఇలా…