Art Exhibition | సుల్తాన్ బజార్, మార్చి 17: కళలకు కాదేది అనర్హమని సల్ప్చర్ విభాగం విద్యార్థులు రూపొందించిన శిల్పాలు ప్రతి ఒక్కరిని ఆలోచింప జేస్తున్నాయి. మాసబ్ ట్యాంక్లోని జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ లోని సల్ప్చర్ విభాగం ఫైనల్ విద్యార్థులు తాము నేర్చుకున్న విద్యను, ప్రతిభతో రూపొందించిన ‘ఫ్రమ్ ది షట్టర్ స్టెప్పింగ్ ఔట్’ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆదివారం ముగిసింది.
సమాజంలో చోటు చేసుకుంటున్న ఘటనలను దృష్టిలో ఉంచుకొని రూపొందించిన శిల్పాకృతులు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు తయారు చేసిన శిల్పాలలో ప్రధానంగా రాబోయే తరంలో ప్లాస్టిక్ భవనాలు ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్లు, రోడ్లపై, వీధి చివరలో గోడలపై అపరిశుభ్ర వాతావరణం కల్పించేలా చేస్తున్న దృశ్యాలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేశాయి. ఇవే కాకుండా ఈ జీవావరణంలో చోటు చేసుకుంటున్న పలు స్థితిగతుల ఆధారంగా రూపొందించిన శిల్పాల ప్రద ర్శన తిలకించేందుకు వస్తున్న వారిని కట్టిపడేస్తుంది.
– కాంతారెడ్డి, సల్ప్చర్ విభాగం కో ఆర్డినేటర్, జేఎన్ఏఎఫ్ఏయూ
విద్యార్థులలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇటువంటి ప్రదర్శనలను నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు విద్యాభ్యాసం సమయంలో తాము నేర్చుకున్న శిక్షణను, ప్రకృతిలో జరుగుతున్న ఘటనల ఆధారంగా శిల్పాలను రూపొందించారన్నారు. విద్యార్థులు తమ పరిసరాలలో, తాము నేర్చుకున్న విద్యను ప్రదర్శన రూపంలో ఉంచారు.