కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 3 : ఉచిత వైద్యశిబిరాలు నిర్వహించడం అభినందనీయమని.. కార్మికులు ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ఎంతో ఉపయోగకరమని కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్లోని భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైద్య శిబిరాల్లో ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేసుకోవడం వల్ల సకాలంలో వ్యాధి నిర్ధారణ జరుగుతుందని.. తద్వారా సకాలంలో చికిత్స పొందవచ్చన్నారు. కార్మిక సంఘం అధ్యక్షుడు జి.సాంబశివరావు, ఉపాధ్యక్షుడు శ్రీకాంత్, ప్రకాశ్, వేగానందం, సలీమ్, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
జీఆర్ఏటీ ఆధ్వర్యంలో
కేపీహెచ్బీ కాలనీలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జీఆర్ఏటీ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త చైర్మన్ సి.లక్ష్మారెడ్డి, ఫౌండర్ ప్రెసిడెంట్ హన్మంతరెడ్డి, సాక్షి ఫైనాన్స్ డైరెక్టర్ ప్రసాద్రెడ్డి, మంజీర కన్స్ట్రక్షన్ సీఎండీ యెగానంద్, సీనియర్ జర్నలిస్టు ప్రసాద్రెడ్డి, కిన్నెర వెల్ఫేర్ సొసైటీ ఫౌండర్ నాగచంద్రికాదేవి, శ్యామలారెడ్డి, రమణారెడ్డి, సుబ్బారెడ్డి, బండి మధుసూదన్రెడ్డి హాజరయ్యారు. శిబిరంలో 1500 మందికి పలు వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు. అలాగే రక్తదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవబాణ, ప్రవీణ్ రెడ్డి,రాజామోహన్రెడ్డి, అంజన్కుమార్ యాదవ్, నాగేశ్వర్రెడ్డి, రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.