కాచిగూడ, నవంబర్ 4: చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, చైర్మన్ బి.పాపిరెడ్డి అన్నారు. నింబోలిఅడ్డా ప్రభుత్వ బాలికల సదనం(జువైనల్హోం)లో ఉచిత లీగల్ ఎయిడ్ క్లినిక్ను శుక్రవారం జడ్జి బి.పాపిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యార్థులు చట్టాలను తెలుసుకొని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఉచిత న్యాయ సేవలు అందుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒకటో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కుశ, నాంపల్లి సీనియర్ సివిల్ జడ్జి రాధిక జైస్వాల్, నింబోలిఅడ్డా ప్రభుత్వ బాలికల సదనం సూపరింటెండెంట్ ఎన్.మైథిలి, జువైనల్ జస్టిస్ బోర్డు లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ సంధ్యారాణి, హరిణితో పాటు ప్రముఖ సంఘసేవకుడు అబ్దుల్ వాసే, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.