ఖైరతాబాద్ : సీఎం పర్సనల్ సెక్రటరీని.. మెడికల్, ఫిజికల్ పరీక్షలు అవసరం లేదు.. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అ ధికారులతో మంచి పరిచయాలున్నాయి..ఎస్సై పోస్టు పెట్టిస్తా.. రూ.25లక్షలు ఖర్చవుతాయి…అంటూ ఓ నిరుద్యోగిని అడ్డంగా ముం చాడు. పంజాగుట్ట పోలీసుల వివరాల ప్రకారం… గత రెండేండ్ల క్రితం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన చెరుకు బద్రీనారాయణ డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో తన బంధువైన బలసాని కుమరస్వామి గౌడ్ ద్వారా సుధాకర్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను సీఎం పర్సనల్ సెక్రటరీనంటూ ఐడీ కార్డు చూపించి, ఫోన్ నంబర్ కూడా ఇచ్చాడు. బద్రీనారాయణ.. తనకు ఎస్ఐ ఉద్యోగం కావాలని కోరగా గ్రీన్ల్యాండ్ వద్ద ఉన్న హరితాప్లాజా హోటల్ వద్దకు రావాలనిన చెప్పాడు.
సుధాకర్ వాడే లగ్జరీ కారు, సెక్యూరిటీ గార్డులను చూసి నిజంగా సీఎం పర్సనల్ సెక్రటరీ అని బ్ర మపడ్డాడు. తనకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారులతో మంచి సంబంధాలు ఉన్నాయని, సబ్ ఇన్స్పెక్టర్ జాబ్ ఇప్పిస్తానని, అందుకు రూ.25లక్షలు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పగా, 2019 ఆగస్టు 10న రూ.10లక్షలు ఆ తర్వాత రెండు దఫాలుగా మరో రూ.15లక్షలు ఇ చ్చాడు. రెండు సంవత్సరాలుగా జాబ్ ప్రాసెస్లో ఉందంటూ దాటవే స్తూ వస్తున్నాడు. ఇటీవల సుధాకర్ ఫోన్ స్విచ్ఛాఫ్ రాగా, అతడి గురిం చి ఆరా తీయగా, అతను సీఎం పర్సనల్ సెక్రటరీ కాదని తెలుసుకున్నాడు. దీంతో మోసపోయినట్లు గ్రహించి పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.