శంషాబాద్ రూరల్, జనవరి 30 : మహిళా సంఘాల పేరున దాదాపు 30 లక్షలకుపైగా దోచుకున్న ఘరానా మోసం సోమవారం శంషాబాద్లో వెలుగు చూసింది. శంషాబాద్ పట్టణానికి చెందిన రమ్యశ్రీ, సాయిబాబా, శ్రీరామ, సప్తగిరి సంఘాలు 2020లో పొదుపు, రుణాలు తీసుకోవడం మానేయడంతో మనుగడలో లేవు. ఇదే ఆదనుగా భావించిన ఆర్పీ రత్న బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రమ్యశ్రీ, సాయి బాబా సంఘంలో ఉన్న మహిళలు కాకుండా ఇతరుల ఫొటోలు పెట్టి రుణాలు తీసుకున్నది.
అలాగే కెనరా బ్యాంకులో సప్తగిరి సంఘం నుంచి మొత్తం 30 లక్షలకుపైగా రుణాలు తీసుకున్నది. అయితే వాటిని తిరిగి చెల్లించడంలేదు. సదరు మహిళా సంఘాలను తిరిగి కొనసాగించేందుకు బ్యాంకుకు వెళ్లిన మహిళల ఈ విషయం తెలియడంతో వారు ఆందోళనకు దిగారు.