హైదరాబాద్: నగరంలోని రాజేంద్రనగర్ (Rajendra Nagar) పీవీ నరసింహారావు (PV Narasimha rao) ప్లై ఓవర్పై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం తెల్లవారుజామున ఆరంఘర్ (Aramghar) నుంచి మెహదీపట్నం (Mehdipatnam) వెళ్తున్న కారు టైరు ఒక్కసారిగా పేలిపోయింది. అదుపుతప్పిన కారు డివైడర్పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టింది. దీంతో అందులో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు.
క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఈ ప్రమాదంతో పీవీ నరసింహారావు ఫ్లై ఓవర్పై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వాహనాలను క్లియర్ చేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితుల వివరాలు తెలియాల్సి ఉంది.