కొండాపూర్ : ప్రజా సమస్యల పరిష్కార దిశగా ముందుకు సాగుతున్నామని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గం పరిధి కొండాపూర్ డివిజన్లోని గెలాక్సీ అపార్ట్ మెంట్స్లో స్థానికులతో కలిసి పర్యటించారు.
ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎక్కడ ఎలాంటి సమస్యలున్న వెంటనే తమ దృష్టికి తీసుకు రావాలన్నా రు. ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పన దిశగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నట్లు తెలిపారు.
గెలాక్సీ అపార్ట్ మెంట్లలో నెలకొన్న డ్రైనేజీ ఔట్లెట్ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటామని, తాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అపార్ట్మెంట్ వాసులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో చందానగర్ డివిజన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి, నాయకులు బాలకృష్ణ యాదవ్, రాజేష్ యాదవ్, జీతూ, అపార్ట్మెంట్ అసోసియేషన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.