మల్కాజిగిరి, జనవరి 26 : కంటోన్మెంట్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బింగి మచ్చెందర్ రావు(95) శుక్రవారం అల్వాల్లోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. మృతిచెందారు. ఆయన సతీమణి పద్మావతి, కుమారుడు రమేశ్కుమార్ గతంలోనే మరణించారు.
ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మచ్చెందర్ రావు 1969-73వరకు హైదరాబాద్ జూవనల్ మెజిస్ట్రేట్ కోర్టులో జడ్జిగా పనిచేశారు. 1978-83వరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి జనత పార్టీ తరఫున ఎమ్మెల్యేగా సేవలందించారు.