అమరావతి : మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ( Talasani Srinivas Yadav) తిరుమలను దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి సుప్రభాత సేవ (Suprabatha) సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేశారు.
తిరుమల (Tirumala ) లో భక్తుల రద్దీ కొనసాగుతుంది . వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 9 కంపార్టుమెంట్లలో వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ (TTD) అధికారులు వివరించారు. నిన్న స్వామివారిని 60,517 మంది భక్తులు దర్శించుకోగా 27,788 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం (Hundi Income) రూ. 3.53 కోట్లు వచ్చిందని వివరించారు.