మేడ్చల్, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఇటివల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మేడ్చల్ నియోజకవర్గం నుంచి నన్ను గెలిపించినందున విజయోత్సవ సమావేశాలు విజయవంతంగా నిర్వహించుకుందామని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లిని క్యాంపు కార్యాలయంలో మేడ్చల్ నియోజకవర్గం ముఖ్య నాయకులతో శనివారం మాజీ మంత్రి మల్లారెడ్డి విజయోత్సవ సన్నాహక సమావేశం నిర్వహించారు.
విజయోత్సవ సభలు శామీర్పేట్ మండలం అలియాబాద్ చౌరస్తా సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల 29న గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ, మేడ్చల్ మండలం, 30న తూకుంట మున్సిపాలిటీ, మూడు చింతలపల్లి, 31న దమ్మాయిగూడ మున్సిపాలిటీ, నాగారం మున్సిపాలిటీ, కీసర మండలం నాయకులు, కార్యకర్తలతో సమావేశాలను నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.