కవాడిగూడ, మే 26: చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీలను దగా చేసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్రావు మండిపడ్డారు. లంబాడా హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ముడావత్ రాంబాల్నాయక్ అధ్యక్షతన సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఇందిరాపార్కు వద్ద నంగారాభేరి పేరుతో మహాధర్నా నిర్వహించారు.
ఈ మహాధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలిపిన అనంతరం మాజీ మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3,146 తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందన్నారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతుంది ధర్నా కాదని లంబాడాల ఆత్మగౌరవ పోరాటం అని అన్నారు. ఎన్నికల ముందు చేతులు జోడించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పామై కాటేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.