సిటీబ్యూరో/అబిడ్స్: వివిధ రాష్ర్టాల నుంచి యువతులను తీసుకొచ్చి తన హోటల్లో వ్యభిచార దందా నిర్వహిస్తున్న ఒక కాంగ్రెస్ లీడర్ ముఖ్య అనుచరుడితో పాటు మరికొందరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… బొగ్గులకుంటలో ఫార్చున్ హోటల్ను కొంతకాలంగా రాంనగర్ అఖిల్ నిర్వహిస్తున్నాడు. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్నాడు. బొగ్గులకుంటలోని తన హోటల్లో పశ్చిమబెంగాల్, ఢిల్లీ, తదితర ప్రాంతాల నుంచి యువతులను ఉద్యోగాలిప్పిస్తామంటూ రప్పించి, ఇక్కడ వ్యభిచార వృత్తిలోకి దింపుతున్నాడు.
గురువారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు ఈ హోటల్పై దాడి చేయడంతో 16 మంది యువతులతో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. నిర్వాహకుడైన రాంనగర్ అఖిల్, హోటల్ మేనేజర్ రఘుపతి, నలుగురు విటులను అరెస్ట్ చేసిన టాస్క్ఫోర్స్ వారిని తదుపరి విచారణకు అబిడ్స్ పోలీసులకు అప్పగించింది. 16 మంది యువతులను కాపాడి..వారిని తుక్కుగూడలోని రిస్క్యూ హోంకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ నరసింహరాజు వెల్లడించారు.