Hyderabad | హైదరాబాద్ : హైదరాబాద్ శివార్లలోని జంట జలాశయాలు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. హిమాయత్ సాగర్కు 4 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, 6 గేట్లు ఎత్తారు. మూసీలోకి 4,120 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్ జలాశయం ఇన్ఫ్లో 2,200 క్యూసెక్కులుగా ఉంది. ఉస్మాన్ సాగర్ ప్రస్తుత నీటిమట్టం 1789.90 అడుగులు కాగా, పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులుగా ఉంది. ఈ జలాశయం 6 గేట్లు ఎత్తి మూసీలోకి 2,028 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తివేయడంతో మూసీకి వరద ప్రవాహం పెరిగింది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.