ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి
ఆర్కేపురం, మే 24 : వరద నీటి కాలువల పనులను త్వరితగతిన పూర్తిచేసే విధంగా చూడాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి కోరారు. గడ్డిఅన్నారం డివిజన్లో చేపట్టాల్సిన వరదనీటి కాలువ పనుల విషయంలో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మంగళవారం జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ను కలిసి చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. శంఖేశ్వర బజార్, శివ గంగా థియేటర్ మార్గంలో వరదనీటి నివారణ చర్యల్లో భాగంగా బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
చార్మినార్ జోన్ నుంచి వచ్చే వరద నీటిలో వ్యర్థాలు ఉండటంతో రోడ్లపై మురుగు ప్రవహిస్తుందని తెలిపారు. ఈ సమస్యను కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లడంతో పైపులైన్లలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలంటూ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎస్ఎన్డీపీ రెండో విడుత కార్యక్రమంలో భాగంగా న్యూ గడ్డిఅన్నారం కమ్యూనిటీ హాల్ నుంచి పీ అండ్ కాలనీ, పోస్ట్ ఆఫీస్ చౌరస్తా, సాయిబాబా దేవాలయం వరకు బాక్స్ డ్రైన్ నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. నిర్మాణంలో ఉన్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కమిషనర్ను కోరినట్లు తెలిపారు. గడ్డిఅన్నారం డివిజన్లో వరదనీరు రోడ్డుపై నిల్వకుండా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ చీఫ్ జియావుద్దీన్, ఎస్ఈ. భాస్కర్రావు, మాజీ కార్పొరేటర్ భవానీ ప్రవీణ్ కుమార్ తదితరులు ఉన్నారు.