సిటీబ్యూరో, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీపీల పనుల్లో కోకాపేట, దుర్గం చెరువు ఎస్టీపీలను అందుబాటులోకి తీసుకువచ్చారు. అంబర్పేట (212.50 ఎంఎల్డీలు), నల్లచెరువు (86.50 ఎంఎల్డీ), పెద్ద చెరువు (17.5 ఎంఎల్డీలు), సఫిల్గూడ (5.50 ఎంఎల్డీలు), మిరాలం (41.50 ఎంఎల్డీలు), నాగోల్ (320 ఎంఎల్డీలు), ఫతేనగర్ (133 ఎంఎల్డీలు), ఖాజాకుంట (20 ఎంఎల్డీలు), వెన్నెలగడ్డ (10 ఎంఎల్డీలు), మియాపూర్ పటేల్ చెరువు (7 ఎంఎల్డీలు) ఎస్టీపీ పనులు తుది దశకు చేరుకున్నాయి. రెండు షిఫ్టుల్లో పనిచేస్తూ పనులు వేగంగా చేస్తున్నారు. రాత్రివేళల్లో పనులు చేసేందుకు వీలుగా లైటింగ్ ఏర్పాటు చేశారు. సివిల్ పనులు పూర్తయిన ఎస్టీపీల్లో ఎలక్ట్రో మెకానిక్ సామగ్రి బిగింపు పనులు చేపడుతున్నారు.
వీటితో పాటు సుందరీకరణకు గార్డెనింగ్, ల్యాండ్స్కేప్ పనులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే మిరాలం, నల్లచెరువు, పెద్ద చెరువు ఎస్టీపీలను వచ్చే వారంలోగా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అధునాతన సీక్వెన్సింగ్ బ్యాచ్ రియాక్టర్ టెక్నాలజీతో కొత్త ఎస్టీపీల నిర్మాణం జరుగుతున్నది. మెట్రో నగరాల్లో స్థలాభావం ఉంటుంది కాబట్టి ఎస్బీఆర్ టెక్నాలజీతో నిర్మాణం అనువుగా ఉంటుంది. వీటి వల్ల ఒకే చాంబర్లో ఐదు స్టేజీల మురుగునీటి శుద్ధి ప్రక్రియ జరిగి.. తకువ విస్తీర్ణంలో ఎకువ నీటిని శుద్ధి చేస్తాయి. దేశంలో వినియోగిస్తున్న వివిధ బయోలాజికల్ ట్రీట్ మెంట్ పద్ధతుల కంటే ఈ ఎస్బీఆర్ విధానానికి తకువ ఖర్చు అవడంతో పాటు మెరుగ్గా మురుగునీటి శుద్ధి జరుగుతుంది. ఇది తేలికైన విధానం. దీనికి విద్యుత్ వినియోగం కూడా తకువగా ఉంటుంది.