హైదరాబాద్: నగరంలోని బేగంపేటలో పేకాట (Playing Cards) కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. బేగంపేట మోతీలాల్ నెహ్రూనగర్లోని అపార్టుమెంటులో అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు అపార్టుమెంటుపై దాడిచేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకుడు అరవింద్ సహ ఐదుగురిని అరెస్టు చేశారు. నిందితుల వద్ద 12.66 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే పోలీసులు కీలక వ్యక్తులను తప్పించారని, ఓ ప్రజాప్రతినిధిని వదిలేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు.