శామీర్పేపేట, ఆగస్టు 20 : కలుషిత నీటి కారణంగా మత్య్సకారులకు తీరని అన్యాయం జరిగిందని, ప్రభుత్వం కలుషిత నీటిని అరికట్టి మత్స్యకారులను ఆదుకోవాలని కొల్తూర్ మత్స్యకారుల సంఘం సభ్యులు కోరారు. మూడుచింతలపల్లిలోని కొల్తూర్ పెద్ద చెరువులో వందల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. విషయాన్ని గమనించిన మత్స్యకారులు, గ్రామస్తులు చెరువు వద్దకు వెళ్లి పరిశీలించారు. తుర్కపల్లి-కొల్తూర్ పరిధి పారిశ్రామికవాడలోని కొన్ని పరిశ్రమల నుండి వెలువడే కలుషిత కెమికల్ నీళ్లే కారణమని ఆరోపించారు. కెమికల్ నీటిని కాలువలోకి వదలడం వల్లే నేడు చేపలు మృత్యువాత పడ్డాయని తెలిపారు.
ఫార్మా కంపెనీల నుండి వచ్చే కెమికల్ నీటితో గత 10 సంవత్సరాలుగా సాగునీటికి, తాగునీటికి కొల్తూర్ గ్రామస్తులు, మత్స్యకారులు ఇబ్బందులు పడుతూనే ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులకు ఫిర్యా దు చేయడంతో నోటీసులు ఇచ్చారని అయినా ఈ ఫార్మా కంపెనీల ఆగడాలు ఆగడం లేదన్నారు. మున్సిపల్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పారిశ్రామిక శాఖల అధికారులు స్పందించి మత్స్యకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు కొండ సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు దుర్గం నర్సింలు, కొండ బిక్షపతి, కొండ పాండు, లక్ష్మయ్య, ఏ.బిక్షపతి, వెంకటేశ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.