మేడ్చల్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో జరుగుతున్న ఈవీఎం, వీవీ ప్యాట్ల ఫస్ట్ లెవల్ చెకింగ్ పక్రియను శుక్రవారం రాష్ట్ర అదనపు ఎలక్ట్రోరల్ ఆధికారి లోకేశ్కుమార్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అధికారి నవీన్ దుద్ది వేర్వేరుగా జిల్లా కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ విజయేందర్రెడ్డితో కలిసి పరిశీలించారు.
ఈవీఎం, వీవీ ప్యాట్లు, బ్యాలెట్ బాక్స్ల పనితీరును ఈసీఐఎల్ ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్వో హరిప్రియ, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.