హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ): కేసు విచారణ నిమిత్తం బీహార్ వెళ్లిన తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులపై సైబర్ దుండగులు కాల్పులకు తెగబడ్డారు. సైబర్ నేరానికి సంబంధించిన కేసులో దుండగులను పట్టుకొనేందుకు బీహార్లోని నవాడాకు వెళ్లిన తెలంగాణ పోలీసులు ఆదివారం పలువురిని అదుపులోకి తీసుకొన్నారు.
అయితే ప్రధాన నిందితుడు మిథిలేశ్ ప్రసాద్ పోలీసులపై కాల్పులు జరుపుతూ తప్పించుకొన్నాడు. ఆ కాల్పుల నుంచి పోలీసులు చాకచక్యంగా తప్పించుకొన్నారు. ఈ ఘటనలో నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని రూ.1,22,77,000 నగదు, మూడు లగ్జరీ కార్లు, ఐదు స్మార్ట్ ఫోన్లు స్వాధీనం చేసుకొన్నారు.