కొనసాగుతున్న అగ్నిమాపక వారోత్సవాలు
విద్యార్థులకు వ్యాస రచన పోటీలు
రక్తదాన శిబిరం ఏర్పాటు
పాల్గొన్న ఎమ్మెల్యే, అగ్నిమాపక అధికారులు
జీడిమెట్ల, ఏప్రిల్ 16: రాష్ట్ర విపత్తు స్పందన, అగ్ని మాపక సేవల శాఖ కూకట్పల్లి డివిజన్ ఆధ్వర్యంలో శనివారం అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని జీడిమెట్ల అగ్ని మాపక కేంద్రం ఆవరణలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వెయ్యి మంది విద్యార్థులకు ఉపన్యాస, వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ హాజరై పోటీల్లో విజేతలకు ప్రశంసాపత్రాలు, మెమోంటోలను అందజేశారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసిఆర్ నాయకత్వంలో దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో అగ్ని మాపక శాఖ డిజాస్టర్ రెస్పా న్స్ టీం పటిష్టంగా ఉందన్నారు. ప్రతిక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు సేవలు అందిస్తున్న అగ్ని మాపక సిబ్బందిని అభినందించారు.
అంతకు ముందు అగ్ని మాపక పరికరాల పని తీరుపై అధికారులు ఎమ్మెల్యేకు, విద్యార్థులకు అవగాహన కల్పించారు. రక్తదాన శిబిరంలో 60 మంది అగ్ని మాపక సిబ్బంది పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో రిజనల్ అగ్ని మాపక అధికారి వి.పాపయ్య, కూకట్పల్లి డివిజన్ డీఎఫ్ఓ బి.సుధాకర్రావు, ఎడీఎఫ్ఓ సైదులు, సతీష్కుమార్, ఎస్హెచ్ఓలు వి.సుభాష్రెడ్డి, సతీష్కుమార్, కృష్ణారెడ్డి, పూర్ణకుమార్, శివ ప్రసాద్, అజ్మత్, టీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రంగరాయ ప్రసాద్, ఎత్తరి మారయ్య, వేణుయాదవ్ , సిద్దిక్, మధుమోహన్తో పాటు అగ్ని మాపక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.