హైదరాబాద్: అమీర్పేట్, పాతబస్తీల్లో ఈ తెల్లవారుజామున రెండు వేర్వేరు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. అమీర్పేట్ పరిధిలోని మధురానగర్లోగల ఓ ఫర్నీచర్ గోదాంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గోదాంలోని లక్షల విలువైన ఫర్నీచర్ కాలి బూడిదైంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
అదేవిధంగా పాతబస్తీలో కూడా ఈ తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీలోని షాలిబండ ఏరియాలోగల బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో దుకాణంలో ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫర్నీచర్ దగ్ధమైనట్లు సమాచారం. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. ఈ రెండు ప్రమాదాలకుగల కారణాలు తెలియాల్సి ఉంది.
#WATCH | Telangana: A massive fire broke out in an electronics showroom at Shalibanda in Hyderabad, at around 1 am today. A total of six fire engines and 30 personnel reached the spot and doused the fire. pic.twitter.com/OG4NvqMMi0
— ANI (@ANI) November 13, 2023