Miyapur | హైదరాబాద్ : మియాపూర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్రో స్టేషన్ డిపో సమీపంలోని చెత్త డంపింగ్ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో అప్రమత్తమైన స్థానికులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పొగ కాల్చడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.