హైదరాబాద్: నగరంలోని రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయదుర్గంలోని (Rayadurgam) గ్రాండ్ స్పైసీ బావర్చి హోటల్ మంటలు అంటుకున్నాయి. భవనంలోని రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి మూడో అంతస్తుకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని క్రేన్సహాయంతో కిందికి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బండిపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు.
భవనంలో యాక్షన్ గార్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సిబ్బందికి కేటాయించిన కార్యాలయంలో మంటలు అంటుకున్నాయని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆఫీస్లో 16 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు.