Fire Accident | రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఎంఎం పహాడీలో ఓ కట్టెల గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు దట్టంగా పొగ వ్యాపించింది. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అత్తాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు. కట్టెల గోదాము కావడంతో మంటలు వేగంగా అంటుకొని అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. మంటలకు తోడు భారీగా పొగ వ్యాపించింది. చలికాలం కావడంతో మంచుకురుస్తున్నది. ఈ క్రమంలో పొగ సైతం వ్యాపించడంతో స్థానికులు శ్వాస తీసుకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ప్రమాదానికి సంబంధించిన కారణాలు తెలియరాలేదు. ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.