పటాన్ చేరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలోని ఆర్.వి.ఇంజినీరింగ్ పరిశ్రమలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్రగాయాలు కావడంతో వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. ఈ ఘటనలో రమణా రెడ్డి (47), సతీష్ (45)తో పాటు మరొకరి తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు అక్కడి నుంచి సురక్షితంగా తప్పించుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.