హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట ఎర్రమంజిల్లోని ఓ అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం (Fire Accident) జరిగింది. అపార్ట్మెంట్ ఆరో అంతస్తులో షార్ట్ సర్క్యూట్తో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. బిల్డింగ్ మొత్తానికి వ్యాపించడంతో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అందులో నివసిస్తున్న కొంతమంది ప్రాణభయంతో బయటికి వచ్చి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులో తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కాగా, మంటల్లో చిక్కుకున్న కుటుంబాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ కాపాడారు. అక్కడ ఉన్న డంబెల్ సహాయంతో డోరును బద్దలు కొట్టి కుటుంబాన్ని బయటకు తీసుకొచ్చారు.