హైదరాబాద్: నగరంలోని బేగంపేట (Begumpet) పరిధిలో ఉన్న ఓల్డ్ కస్టమ్ బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బస్తీలోని ఓ బిల్డింగ్ మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో మంటలను గమనించిన భవనంలోని ప్రజలు కిందికి వచ్చేయడంతో భారీ ప్రమాదం తప్పిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. షార్ట్ సర్క్కూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మంటల్లో భవనంలో ఉన్న పీవోపీ వాల్స్ తయారీ మెటీరియల్, డైస్ దగ్ధమయ్యాయని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.