షేక్పేట్ : షేక్పేట్ డివిజన్ పారామౌంట్ కాలనీకి చెందిన హుస్సేన్ ఖాన్కు సీఎం రిలీఫ్ ఫండ్లో మంజూరైన 2లక్షల50 వేల రూపాయలకు సంబంధించిన ఎల్వోసి పత్రాన్ని సోమవారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అందచేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అన్నీ వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు దుర్గం ప్రదీప్కుమార్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.