బంజారాహిల్స్, జూన్ 25: నటుడిని మోసం చేసిన సినీ నిర్మాతతో పాటు మరో వ్యక్తిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. రోడ్ నం. 8లో నివాసముంటున్న సాయికిరణ్ను నిర్మాత జాన్బాబు మన్నా మినిస్ట్రీస్ అనే సంస్థలో సభ్యుడిగా చేరితే సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయని, భారీగా డబ్బులు సంపాదించే అవకాశం ఉంటుందని నమ్మించాడు.
దీంతో సాయికిరణ్ రూ. 10.6 లక్షలు సభ్యత్వ రుసుముగా చెల్లించగా, నెలలు గడిచినా సినిమా అవకాశాలు రాకపోవడంతో డబ్బులు ఇవ్వాలని కోరాడు. దీంతో జాన్బాబు అతడి స్నేహితుడు లివింగ్ స్టోన్ బెదిరింపులకు దిగారు. రూ. 5 లక్షల చొప్పున చెక్కులు ఇచ్చినా.. అవి బౌన్స్ అయ్యాయి. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా జాన్బాబు, లివింగ్స్టోన్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.