చిక్కడపల్లి, మే 20 : మూర్ఖుని చేతిలో దేశం ఉందని, పిచ్చిపిచ్చి వేషాలు వేస్తున్నారని ఇది చాలా కాలం కొనసాగదని ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ అన్నారు. రచయిత(ఆంధ్రజ్యోతి సంపాదకులు) కె.శ్రీనివాస్ రచించిన ‘బుల్డోజర్ సందర్భాలు’ పుస్తకావిష్కరణ కార్యక్రమాన్ని శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రకాశ్ రాజ్ హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బుల్డోజర్కి హృదయం లేదని, కేవలం భయపెడుతుందని, ఎదుటి వారి భయం మీ ఆధారపడి మాత్రమే బుల్డోజర్ పనిచేస్తుందని వివరించారు.
చరిత్రను పరిశీలిస్తే నియంతలు చాలాకాలం కొనసాగిన చరిత్ర లేదని గుర్తు చేశారు. మనిషిని మినిషిగా చూడాల్సి ఉందని, నేటి పాలనలో ఇది కొరవడిందన్నారు. సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ ఫాసిజం కొత్త రూపాన్ని సంతరించుకుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం పేరిట పాలన జరుగుతున్నది కానీ, అక్కడ ప్రజాస్వామ్యం ఉండదన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటే ఉంది. వార్త ఛానెళ్లు ఒక వర్గానికి అనుకూలంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. మలుపు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త సజయ, బి.బి.సి తెలుగు ఎడిటర్ జి.ఎస్.రామ్మోహన్, మలుపు బాల్రెడ్డి తదితరులు ఆపల్గొన్నారు.