సిటీబ్యూరో, అక్టోబర్ 11 ( నమస్తే తెలంగాణ ): ఫిక్కీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో బుధవారం సోమాజిగూడలోని ది పార్క్ హోటల్లో మానసిక ఆరోగ్యంపై మధ్యాహ్నం రెండు గంటలకు సదస్సు నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
నిపుణులు శివానీ అగర్వాల్, దివాస్ గుప్తా, డాక్టర్ కరన్ కక్కడ్ వంటి వారు ప్రసంగిస్తారని వివరించారు. అవసరమైన వారు ఈ సదస్సుకు హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని సూచించారు.